Telangana: భర్త పొమ్మన్నాడు - ప్రియుడు కాదన్నాడు.. ఓ యువతి మౌనపోరాటం!

  • ప్రేమించిన ప్రియుడిని వదిలి ఉండలేని యువతి
  • బలవంతంగా వివాహం జరిపించిన తల్లిదండ్రులు
  • సహృదయంతో అర్థం చేసుకుని వెనక్కు పంపిన భర్త
  • ఇప్పుడు కాదంటున్న ప్రియుడు
  • న్యాయం కోరుతున్న యువతి

తాళి కట్టిన భర్తతో జీవితాన్ని గడపలేక, మనసారా ప్రేమించిన యువకుడికి దగ్గర కాలేకపోయిన, తెలంగాణ పరిధిలోని ఆలేరు ప్రాంత యువతి ఇప్పుడు తనకు న్యాయం చేయాలని కోరుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రాఘవాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ, అరుణల కుమార్తె రేఖ, అదే గ్రామానికి చెందిన శివరామ్ పరస్పరం ప్రేమించుకున్నారు.

అయితే, వారి ప్రేమను ఇష్టపడని తల్లిదండ్రులు సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తితో రేఖకు బలవంతంగా పెళ్లి జరిపించారు. తాను ఇంతకుముందే ఓ యువకుడిని ప్రేమించానని, అతనితోనే కలిసుండాలని కోరుకుంటున్నానని ఆమె తన భర్తకు చెప్పడంతో, ఆమెను వెంటనే ఇంటి నుంచి పంపించేశాడు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న రేఖ, తనను వివాహం చేసుకోవాలని శివారామ్ ను కోరుతూనే ఉంది.

ఒకసారి పెళ్లయిన నిన్ను పెళ్లి చేసుకునేది లేదని శివరామ్ తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుబోని ఆమె, తనకు న్యాయం చేయాలని కోరుతూ శివరామ్ ఇంటి ముందు దీక్షకు కూర్చుంది. ఆపై శివరామ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రేఖకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, తిరిగి జీవితాన్ని ప్రారంభించాలని నచ్చజెపుతున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News