Sabarimala: 25 రోజుల్లోనే రూ. 100 కోట్లు... ఆయ్యప్ప ఆల్ టైమ్ రికార్డు

  • రికార్డు స్థాయికి అయ్యప్ప స్వామి హుండీ ఆదాయం
  • ఈ సీజన్ లో రూ. 300 కోట్లు దాటే అవకాశం
  • వెల్లడించిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు

కేరళలోని శబరిగిరుల్లో పంబానది తీరాన వెలిసిన అయ్యప్ప స్వామి, ఈ సంవత్సరం 25 రోజుల వ్యవధిలోనే రూ. 100 కోట్లను భక్తుల నుంచి కానుకల రూపంలో అందుకున్నాడు. మండల పూజ ప్రారంభమైన 25 రోజుల్లోనే ఇంత మొత్తం హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ 25 రోజుల వ్యవధిలో సుమారు వారం రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు, పంబానదికి వరదల కారణంగా పూర్తి స్థాయిలో భక్తులను అనుమతించ లేదని, అయినా ఆల్ టైమ్ రికార్డుకు ఆదాయం చేరుకుందని టీడీబీ అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ ముగిసేలోపు రూ. 300 కోట్లకు పైగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News