Virat Kohli: దటీజ్ కోహ్లీ-అనుష్క! రిసెప్షన్ కోసం వెరైటీ ఆహ్వానం!

  • రిసెప్షన్ ఆహ్వానంలో వైవిధ్యం చూపుతున్న ‘విరుష్క’
  • ఆహ్వాన పత్రికతోపాటు ఓ మొక్క కూడా..
  • 21న ఢిల్లీలో, 26న ముంబైలో వివాహ విందు

ఎవరినీ ఆహ్వానించకుండా గుట్టుగా ఇటలీలో పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు రిసెప్షన్లను మాత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 21న ఢిల్లీలో కుటుంబ సభ్యులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులకు విందు ఇవ్వనున్నారు. రిసెప్షన్‌ కోసం ఆహ్వాన పత్రికలు కూడా అచ్చేయించారు. వేల రూపాయల విలువైన ఈ రిసెప్షన్‌ కార్డుతో పాటు అతిథులను ఆహ్వానించే సమయంలో మరో మర్చిపోలేని బహుమానాన్ని ఇవ్వాలని కొత్త జంట నిర్ణయించుకున్నారు.

విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతోపాటు ఓ మొక్కను కూడా బహుమతిగా అందిస్తున్నారు. పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని పేపర్ బ్యాగులో ఆ మొక్కను పెట్టి కార్డుతో పాటు అందిస్తున్నారు. వారి ఆహ్వానానికి అందరూ ముగ్ధులవుతున్నారు. అయితే ఈ మొక్క ఐడియా ఎవరిచ్చారన్న విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్!

More Telugu News