Sushant Singh Rajput: భావోద్వేగ‌పూరితంగా ట్వీట్ చేసిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌!

  • ఈ రోజు సుశాంత్ త‌ల్లి వ‌ర్థంతి
  • ఆమెను గుర్తు చేసుకున్న సుశాంత్‌
  • ఈ రోజు నిన్ను కోల్పోయాను అమ్మా
  •  నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను

‘ఎం.ఎస్‌ ధోనీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ రోజు భావోద్వేగపూరితంగా ఓ ట్వీట్ చేశాడు. ఈ రోజు ఆయ‌న‌ తల్లి వ‌ర్ధంతి నేప‌థ్యంలో ఈ ట్వీట్ చేశాడు. ఈ రోజు నిన్ను కోల్పోయాను అమ్మా అని ఆయ‌న పేర్కొన్నాడు. 'నువ్వున్నంత వరకు నేనూ ఉన్నాను. ఇప్పుడు నీ జ్ఞాపకాలతో బతుకుతున్నా'నని అన్నాడు. సుశాంత్ గ‌తంలో త‌న త‌ల్లికి గుర్తుగా చేతిపై టాటూ కూడా వేయించుకున్నాడు. ఈ సందర్భంగా తన తల్లి ఫొటోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం సుశాంత్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.   

More Telugu News