Cricket: ఘ‌న విజ‌యానికి చేరువ‌లో టీమిండియా

  • శ్రీలంక టార్గెట్‌ చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగులు
  • టీమిండియా విజ‌యం ఖ‌రారు
  • క్రీజులో మాథ్యూస్ 91, ల‌క్మల్ 4

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో జ‌రుగుతోన్న భార‌త్, శ్రీలంక వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా విజ‌యానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో మ్యాథ్యూస్ మాత్ర‌మే రాణిస్తూ ఒంట‌రి పోరాటం చేస్తున్నాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణ‌తిల‌క 16, త‌రంగ 7, తిరిమ‌న్నే 21, డిక్ వెల్లా 22, అసెలా గుణ‌ర‌త్నే 34, పెరెరా 5 ప‌రుగులు చేసి అవుటైన విష‌యం తెలిసిందే.

అనంత‌రం కొద్ది సేప‌టికే భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ప‌తిరానా (2) అవు‌టయ్యాడు. క్రీజులో కాసేపు నిల‌బ‌డిన ధ‌నంజ‌య కూడా 11 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో మాథ్యూస్ 91, ల‌క్మల్ 4 ప‌రుగుల‌తో ఉన్నారు. శ్రీలంక మ‌రో 30 బంతుల్లో 171 ప‌రుగులు చేయాల్సి ఉంది. 

More Telugu News