చంద్రబాబు: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు!

  • బతికి ఉండగానే తమ పేరును పథకాలకు పెట్టుకుంటారా?
  • ఏపీలో 21 పథకాలకు చంద్రబాబు పేరు పెట్టారు
  • ‘ఫ్యూచర్ గ్రూప్’లో చంద్రబాబుకు వాటాలు
  • పవన్ కల్యాణ్ ఓ గజినీలా మారిపోయారు: ఎమ్మెల్యే రోజా

తాము బతికి ఉండగానే తమ పేరును సంక్షేమ పథకాలకు ఎవరైనా పెట్టుకుంటారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 21 పథకాలకు చంద్రబాబు పేరు పెట్టారని, బతికి ఉండగానే ఎవరైనా తమ పేర్లను పథకాలకు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రన్న మాల్స్ పేరుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, రేషన్ షాపుల ఆధునికీకరణ కాంట్రాక్ట్ ను ‘ఫ్యూచర్ గ్రూప్’ సంస్థకు ఇచ్చారని, ఆ గ్రూప్ లో చంద్రబాబుకు వాటాలున్నాయని రోజా ఆరోపించారు.

ఇక జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ గజినీలా మారిపోయారని, జగన్ ని విమర్శించే నైతికహక్కు పవన్ కి లేదని అన్నారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే పవన్ కు కేసీఆర్, చంద్రబాబు కుటుంబాలు కనిపించడం లేదా? అధికారం కోసం కాకపోతే నాడు పీఆర్పీ, నేడు ‘జనసేన’ను ఎందుకు స్థాపించారు? అని రోజా ప్రశ్నించారు. 

More Telugu News