Narendra Modi: న‌వ్వుకుంటూ మాట్లాడుకున్న ప్ర‌ధాని మోదీ, మ‌న్మోహ‌న్ సింగ్‌!

  • ఉగ్ర‌దాడి మృతుల‌కు నివాళి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఇరు నేత‌లు
  • ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు
  • విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెట్టి మృతుల‌కు నివాళి

కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు... ఒక‌చోట క‌లిస్తే ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి తెలుసు. కానీ, ఇవాళ వారి మ‌ధ్య ప్రేమ ప‌ల‌క‌రింపులు, న‌వ్వుతూ మాట్లాడుకోవడాలు క‌నిపించాయి. అవును.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి మృతుల‌కు నివాళి కార్య‌క్ర‌మంలో ఇరు పార్టీల నాయ‌కులు పాల్గొన్నారు. అక్క‌డ విమ‌ర్శ‌లు, తార‌త‌మ్యాలు ప‌క్క‌న‌బెట్టి ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ప‌ల‌కరించుకున్నారు.

ప్ర‌ధాని మోదీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌ర‌చాల‌నం చేసుకోవ‌డం, కేంద్రమంత్రులు సుష్మా, రవిశంకర్‌ప్రసాద్‌ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడటం వంటి దృశ్యాలు అక్క‌డ ఆవిష్కృత‌మ‌య్యాయి. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది భ‌ద్ర‌తా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు కూడా పాల్గొన్నారు.
  

More Telugu News