vijay: విజ‌య్ చివ‌రి కోరిక... రెండ్రోజులు భార్య‌తో హ్యాపీగా ఉండాల‌ని!

  • చివ‌రి ఫోన్‌కాల్‌లో వెల్ల‌డించిన విజ‌య్‌
  • పదిహేను నిమిషాలు క‌లిసి మాట్లాడుకుందామ‌న్న న‌టుడు
  • వ‌నితా రెడ్డి జీవితానికి ఇక అడ్డుప‌డ‌న‌ని వ్యాఖ్య‌

క‌మెడియ‌న్ విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య చేసుకుని మూడు రోజులైంది. తన ఆత్మ‌హ‌త్యకు భార్యే కార‌ణ‌మ‌ని ఓ సెల్ఫీ వీడియోలో విజ‌య్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే అత‌ను చివ‌రిసారిగా భార్య‌తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో టేపు ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అందులో త‌న చివ‌రి కోరికను విజ‌య్ వెల్ల‌డించాడు. భార్య‌తో క‌లిసి రెండ్రోజులు హ్యాపీగా ఉండాల‌నేది అత‌ని చివ‌రి కోరిక‌.

ఈ ఆడియోలో ఇంకా చాలా విష‌యాల‌ను విజ‌య్ మాట్లాడాడు. ఒక్క ప‌దిహేను నిమిషాలు క‌లిసి మాట్లాడుకుందామ‌ని భార్య వ‌నితా రెడ్డిని విజ‌య్ కోరాడు. వ‌నిత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, టెన్ష‌న్‌గా జీవించ‌వ‌ద్ద‌ని, ఇక త‌న జీవితంలోకి అడ్డురాన‌ని విజ‌య్ చెప్పాడు. అలాగే వారి జీవితంలోకి మూడో వ్య‌క్తి ఎంట‌ర్ అవ్వ‌డం వ‌ల్ల త‌మ జీవితాలు చెల్లాచెదుర‌య్యాయ‌ని విజ‌య్ పేర్కొన్నాడు.

More Telugu News