Rohit Sharma: భారీ స్కోరు దిశగా భారత్.. దూకుడు కొనసాగిస్తోన్న రోహిత్!

  • సిక్సర్లతో విరుచుకుపడుతున్న రోహిత్
  • కెప్టెన్ గా ఒక మ్యాచ్ లో హైయ్యెస్ట్ స్కోర్
  • ఇండియా స్కోర్ 336/2

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో 150 పరుగుల మైలు రాయిని అధిగమించాడు. మొత్తం 138 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 8 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 162 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో కెప్టెన్ గా ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ గా రోహిత్ అవతరించాడు. మరోవైపు తొలి వన్డే ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ 88 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అయ్యర్ 2 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అయ్యర్ ఔట్ అయిన తర్వాత ధోనీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 336 పరుగులు (46.3 ఓవర్లు).  

More Telugu News