srikakulam: యువ‌తిపై దాడి చేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ‌కుడు!

  • శ్రీకాకుళంలో ఘ‌ట‌న‌
  • తాను ప్రేమిస్తోన్న యువ‌తి ఇంటికి వెళ్లిన కృష్ణారావు
  • కాసేపు మాట్లాడి దాడి
  • యువ‌తికి ఆసుప‌త్రిలో కొన‌సాగుతోన్న‌ చికిత్స‌

ఓ యువతిపై కృష్ణారావు అనే యువ‌కుడు దాడికి పాల్పడ్డ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. పాతపట్నంకు చెందిన సదరు యువకుడు తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి, కత్తితో దాడి చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌నలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ యువ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే తిలక్‌నగర్‌లో నివాసం ఉండే భ్రమరాంబిక ఇంటికి వచ్చిన కృష్ణారావు కాసేపు ఆమెతో మాట్లాడాడు.

ఈ క్ర‌మంలో గొడ‌వ‌ప‌డి భ్రమరాంబికపై దాడి చేసి.. ఓ గ‌దిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. త‌న‌వ‌ద్ద ఉన్న‌ కత్తితో పొడుచుకుని కృష్ణారావు చనిపోయాడు. భ్రమరాంబికను శ్రీకాకుళం రిమ్స్ ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. కృష్ణారావు, భ్ర‌మ‌రాంబిక కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News