priyanka chopra: ప్రియాంక చోప్రాకు మ‌ద‌ర్ థెరిసా అవార్డు

  • సామాజిక సేవ‌కు గుర్తింపుగా స‌త్కారం
  • షూటింగ్‌లో బిజీగా ఉండి రాలేక‌పోయిన న‌టి
  • అవార్డు తీసుకున్న త‌ల్లి మ‌ధుచోప్రా

అంత‌ర్జాతీయ న‌టి ప్రియాంక చోప్రా మ‌రో గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఎంతో సామాజిక సేవ చేస్తున్న ప్రియాంక‌ మ‌ద‌ర్ థెరిసా జ్ఞాప‌క అవార్డు కోసం ఎంపికైంది. స‌మాజానికి సేవ చేసిన వారికి ఈ అవార్డును మ‌ద‌ర్ థెరిసా ట్ర‌స్ట్ అంద‌జేస్తుంది. అయితే షూటింగుల్లో బిజీగా ఉన్న కార‌ణంగా ప్రియాంక ఈ అవార్డు అందుకోవ‌డానికి రాలేక‌పోయింది. దీంతో ఆమె త‌ర‌ఫున త‌ల్లి మ‌ధుచోప్రా ఈ అవార్డును స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా మ‌ధు చోప్రా మాట్లాడుతూ -  'ప్రియాంక‌కి చిన్న‌ప్ప‌టి నుండి మ‌ధ‌ర్ థెరిస్సా అంటే ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌ నివాస్‌ అనే వృద్ధాశ్రమానికి ప్రియాంక విరాళాలు కూడా ఇచ్చేది. స‌మాజానికి సేవ చేస్తున్న ప్రియాంక ఈ అవార్డుకు అర్హురాలే' అని మ‌ధు చోప్రా అన్నారు.

More Telugu News