car: బైకును ఢీ కొన్న కారు.. మృతదేహాన్ని 17 కిలోమీటర్లు ఈడ్చుకుపోయిన వైనం!

  • గ్రేట‌ర్ నోయిడాలో ఘ‌ట‌న‌
  • కారు బోనెట్‌లో ఇరుక్కుపోయి చ‌నిపోయిన ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు
  • సీసీటీవీ ఆధారంగా కారు య‌జ‌మాని గుర్తింపు 

గ్రేట‌ర్ నోయిడాలో చోటు చేసుకున్న దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. ఓ బైకును వేగంగా వ‌చ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో బైకు న‌డుపుతోన్న వ్య‌క్తి కారు బోనెట్‌లో ఇరుక్కుపోయి చ‌నిపోయాడు. ఆ వ్య‌క్తి మృత‌దేహం కారుపైనే ఉన్న‌ప్ప‌టికీ కారు డ్రైవర్ 17 కిలోమీటర్లు అలాగే వెళ్లాడు. అనంత‌రం సిఖందరాబాద్ ప్రాంతం వద్ద మృతదేహాన్ని రోడ్డు పక్కన ప‌డేసి వెళ్లిపోయాడు.

కారులో ఇరుక్కున్న‌ ఆ మృతదేహాన్ని మొత్తం 17 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు గ్రేటర్ నోయిడాకు సమీపంలోని సూరజ్‌పూర్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్ అని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని శ‌వప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు యజమానిని గుర్తించారు. నిందితుడిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు. 

More Telugu News