uma madhavareddy: టీఆర్ఎస్ లో చేరనున్న టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి

  • కేసీఆర్ తో ఉమా మాధవరెడ్డి భేటీ
  • ఈ నెల 14న టీఆర్ఎస్ లో చేరిక
  • కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామన్న ఉమ కుమారుడు

తెలంగాణ టీడీపీ నాయకురాలు ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ రోజు ఆమె ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆమె వెంట ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో ఉమా మాధవరెడ్డి చర్చలు జరిపారు.

టీఆర్ఎస్ చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీరి రాకను కేసీఆర్ ఆహ్వానించారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తమ అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.

More Telugu News