agnathavasi movie: పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్!

  • 19న ఆడియోలాంచ్ ఫంక్షన్
  • ముఖ్య అతిథిగా మెగాస్టార్
  • జనవరి 10న విడుదల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 19న లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ వేడుకకు పవన్ అన్నయ్య చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపైకి రానుండటం మెగా ఫ్యాన్స్ కు పండగే. పవన్ కల్యాణ్ 25వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

More Telugu News