nithin: పవన్ బ్యానర్ లో నితిన్ చేస్తోన్న సినిమాకి టైటిల్ ఖరారు

  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 
  • అమెరికాలో ఫస్టు షెడ్యూల్ పూర్తి 
  • టైటిల్ గా 'గుర్తుందా శీతాకాలం'
  • కథానాయికగా మేఘా ఆకాశ్

ప్రస్తుతం నితిన్ .. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ .. శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథా పరంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అమెరికాలో జరగనుంది. కొన్ని రోజుల క్రితమే అక్కడికి చేరిన ఈ సినిమా టీమ్, ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసి .. రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో, ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తమన్ అందించిన సంగీతం ఈ లవ్ స్టోరీకి ప్రధానమైన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే .. దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' చేయనున్న సంగతి తెలిసిందే.    

More Telugu News