Virat Kohli: ఎప్పటికీ కలిసుండాలని ప్రమాణం చేసుకున్నాం: పెళ్లి తరువాత కోహ్లీ తొలి వ్యాఖ్య

  • ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం
  • ఈ రోజు మాకెంతో ప్రత్యేకం
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన కోహ్లీ

'జీవితంలో ఎప్పటికీ ప్రేమానుబంధం మధ్య కలిసి ఉంటామని నేడు మేమిద్దరం ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం. ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబసభ్యులు, అభిమానులు, బంధుమిత్రుల మద్దతుతో, ప్రేమ, ఆశీస్సులతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. మా ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు" అని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. విరాట్ ను వరించేందుకు అనుష్క పూలమాలను తీసుకురాగా, తను ఆనందంతో పొంగిపోతున్న చిత్రాన్ని పోస్టు చేశాడు. కోహ్లీ ట్వీట్ లక్షలాది లైక్స్, వేలాది షేర్స్ తెచ్చుకుంది.

More Telugu News