polavaram: పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం నిధులు విడుద‌ల చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

  • రూ.318.22 కోట్లు విడుద‌ల‌
  • రాష్ట్ర స‌ర్కారు పెట్టిన ఖ‌ర్చులో భాగంగా నిధుల విడుదల
  • పీఎంకేఎస్‌వై కింద పోల‌వ‌రం ప్రాజెక్టుకు నాబార్డ్ నిధులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు రూ.318.22 కోట్లు విడుద‌ల చేసింది. రాష్ట్ర స‌ర్కారు పెట్టిన ఖ‌ర్చులో భాగంగా ఈ నిధులు విడుదల చేస్తున్న‌ట్లు పేర్కొంది. పీఎంకేఎస్‌వై కింద పోల‌వ‌రం ప్రాజెక్టుకు నాబార్డ్ నిధులు అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నిధులు కూడా దాని ద్వారానే అందాయి. పోలవ‌రం ప్రాజెక్టుల ప‌నుల్లో జాప్యం జ‌రుగుతోంద‌ని కొన్ని రోజులుగా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌నుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేస్తామ‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంది.  

More Telugu News