Chandrababu: చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఏ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్‌గా చేశారో తెలుసా?: రోజా

  • ఎయిడ్స్ లో, మ‌హిళ‌ల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేయ‌డంలో నెం.1గా చేశారు
  • ఇవి నేను చెబుతున్న‌వి కావు
  • చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలుపుతోన్న ప‌త్రిక‌లే తెలిపాయి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా చేస్తున్నాన‌ని చెప్పుకుంటున్నార‌ని, అయితే రాష్ట్రాన్ని చంద్ర‌బాబు ప‌నికిరాని విష‌యాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా చేశార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తాజాగా తాను ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఓ వీడియోను రోజా త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. "చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని ఏ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్‌గా చేశారో తెలుసా? ఎయిడ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా చేశారు. ఇది నేను చెబుతున్న‌ది కాదు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలిపే ఆంధ్ర‌జ్యోతి పేప‌రే తెలిపింది.

అలాగే మ‌హిళ‌ల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేసే విషయంలో రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్‌గా ఉంది. ఇది నేను చెబుతున్న‌ది కాదు.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలిపే ఈనాడు పేప‌రే నాలుగు రోజుల క్రితం రాసింది. చంద్ర‌బాబు ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ అవినీతి ముఖ్య‌మంత్రి అని రిపోర్టులు చెబుతున్నాయి. అంటే ప‌నికిరాని విష‌యంలో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ చేస్తున్నారు. త‌న‌కి వాచీ లేద‌ని, ఉంగ‌రం లేద‌ని చంద్ర‌బాబు చెప్పుకుంటున్నారు. ఆస్తుల ప్ర‌క‌ట‌న అంటూ దొంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు" అని రోజా వ్యాఖ్యానించారు.

More Telugu News