amaravati: రేపు అమ‌రావ‌తికి వెళ్లి.. రాజ‌ధాని నిర్మాణ ఆకృతుల‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చ‌ర్చ‌!

  • మంత్రి నారాయ‌ణ‌, నార్మన్‌ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీ అధికారులతో భేటీ
  • అనంత‌రం సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం
  • ఎల్లుండి ఏపీ స‌ర్కారు ఆకృతుల‌ను ఖరారు చేసే అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఆకృతుల‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సాయం తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి రేపు ఏపీ మంత్రి నారాయ‌ణ‌, నార్మన్‌ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో భేటీ కావ‌డానికి అమ‌రావ‌తి వెళ్ల‌నున్నారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం అవుతారు. రాజ‌ధాని ఆకృతుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ఎల్లుండి ఖరారు చేసి, ప్ర‌జాభిప్రాయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రాజ‌మౌళి ప‌లుసార్లు రాజ‌ధాని ఆకృతుల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే.      

More Telugu News