ravi shankar prasad: పాకిస్థాన్ కు కౌంటర్ ఇచ్చిన బీజేపీ!

  • పాక్ వ్యాఖ్యల వెనుక అంతులేని ద్వేషం దాగుంది
  • మాకు పాఠాలు చెప్పడం మానుకోవాలి
  • పాక్ పై మండిపడ్డ రవిశంకర్ ప్రసాద్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అహ్మద్ పటేల్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు దాయాది దేశం పాకిస్థాన్ కుట్ర పన్నిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఫైజల్ ట్విట్టర్ లో స్పందిస్తూ, "భారత ఎన్నికల అంశంలోకి పాకిస్థాన్ ను లాగే ప్రయత్నం చేయకండి. కట్టు కథల ద్వారా కాకుండా, సొంత శక్తి మీద విజయం సాధిస్తే బాగుంటుంది" అంటూ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. భారత అంతర్గత వ్యవహారాల్లో బయటి దేశం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని... దీని వెనుక అంతులేని ద్వేషం దాగుందని అన్నారు. భారత్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తోందో అందరికీ తెలుసని చెప్పారు. భారత్ కు పాఠాలు చెప్పడాన్ని పాకిస్థాన్ మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News