సీఎం చంద్రబాబు: ఏపీలో మంచి నేల.. మంచి పంట కావాలి: సీఎం చంద్రబాబు

  • గోదావరి, కృష్ణా డెల్టాలలో రబీ పనులు త్వరగా ముగించాలి
  •  నకిలీ విత్తనాల తయారీదారులను, విక్రయించే వారిని అరెస్ట్ చేయాలి
  • సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

ఏపీలో మంచి నేల తయారై, మంచి పంట రావాలని  సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీరు-ప్రగతి’, వ్యవసాయంపై సీఎం టెలీ కాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పంటలకు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గించగలిగామని చెప్పారు. గోదావరి, కృష్ణా డెల్టాలలో రబీ పనులు త్వరగా ముగించేలా చూడాలని, ఖరీఫ్ మాదిరిగానే రబీ కూడా మూడు వారాల ముందే ముగించాలని సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులను, విక్రయించే వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. 

More Telugu News