gujarat assembly elections: మోదీ, రాహుల్ గాంధీల రోడ్ షోలకు అనుమతి నిరాకరణ

  • మంగళవారం నాడు అహ్మదాబాద్ లో రోడ్ షోలు
  • అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు
  • శాంతి భద్రతల సమస్యే కారణం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారంనాడు ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు అహ్మదాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అయితే వీరి రోడ్ షోలకు అహ్మదాబాద్ పోలీసులు అనుమతిని నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరిద్దరి రోడ్ షోల వల్ల ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు.

More Telugu News