ntr: చ‌ర‌ణ్‌, తార‌క్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌?

  • రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టిసారి
  • టాలీవుడ్ వ‌రుస ఛాన్సులు
  • సినిమాల‌తో బిజీ అయిన న‌టి

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి రూపొందించనున్న చిత్రంలో క‌థానాయికగా అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా దీని గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంగా తెర‌కెక్కుతున్న‌ట్లు ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇద్ద‌రు హీరోల‌కు ఒకే న‌టిని తీసుకుంటున్నారా? లేక మ‌రో న‌టిని కూడా ఎంచుకోబోతున్నారా? అనే విష‌యం తెలియాల్సి ఉంది.

ఏదేమైనా అను ఇమ్మాన్యుయేల్‌కి వ‌రుస ఛాన్సులు వ‌స్తున్నాయ‌నడంలో అతిశ‌యోక్తి లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టిసారి న‌టిస్తున్న ఈ న‌టి ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అతి తక్కువ సమయంలో పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, గోపీచంద్‌లాంటి స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌కి జోడీగా, నాగచైతన్యకు జోడీగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల‌తో అను బిజీగా మార‌నుంది.

More Telugu News