Swati: ఇలాంటి ట్విస్ట్ మా సర్వీసులో చూడలేదు: స్వాతి కేసులో పోలీసు ఉన్నతాధికారులు

  • ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసిన స్వాతి
  • ఆపై యాసిడ్ దాడి నాటకం
  • కేసు చాలా అరుదైనదన్న పోలీసులు

ప్రియుడితో కలసి భర్తను దారుణంగా చంపి, మృతదేహాన్ని తగులబెట్టి, ఆపై ప్రియుడితో కలసి నాగర్ కర్నూలు జిల్లాలో స్వాతి చేసిన పనులు చూసిన పోలీసు ఉన్నతాధికారులు తమ సర్వీసులో ఇన్ని ట్విస్టులున్న కేసును చూడలేదని అంటుండటం గమనార్హం. ఈ కేసులో నిందితురాలు స్వాతిని మీడియా ముందు చూపిన వేళ, నాగర్ కర్నూల్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడారు.

భర్తపై యాసిడ్ దాడి జరిగినట్టు డ్రామాలాడి, ఆ స్థానంలో ప్రియుడిని తెచ్చుకోవాలన్నది స్వాతి అభిమతమని, బంధువులకు వచ్చిన అనుమానంతో తాము విచారించి, అసలు నిజాన్ని తేల్చామని తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని, సమాజం మారుతున్న ధోరణికి ఇవి నిదర్శనమని, నేరప్రవృత్తిలో స్త్రీ, పురుషులు అన్న తేడాలు ఉండవని స్వాతి నిరూపించిందని అన్నారు. ఈ కేసులో రాజేష్ మొదటి నిందితుడని, స్వాతిని రెండో నిందితురాలిగా చేర్చామని అన్నారు. కోర్టులో నేడు పిటిషన్ వేసి ఆమెను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా కేసును విచారిస్తామని తెలిపారు.

More Telugu News