India: కోహ్లీలేని క్రికెట్ సేనపై పేలుతున్న ట్వీట్లు... మచ్చుకు కొన్ని!

  • ధర్మశాలలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా
  • కోహ్లీ లేని కారణంగానే ఇలా జరిగిందంటూ ఎద్దేవా
  • భారత రన్ రేటు, ఎయిర్ టెల్ 4జీ స్పీడూ ఒక్కటేనట!

నిన్న ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే క్రికెట్ లో పేలవమైన ఆటతీరుతో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టుపై నెట్టింట జోకుల మీద జోకులు పేలుతున్నాయి. ఓ యూజర్ పెట్టిన కామెంట్ మరింత వైరల్ అయింది. "కోహ్లీ లేని భారత బ్యాటింగ్ లైనప్, ఆధార్ కార్డు లింక్ చేయబడని బ్యాంకు ఖాతా వంటిది" అన్న ట్వీట్ హైలైట్ గా నిలిచింది. ఇక అనుష్క కన్నా భారత క్రికెట్ జట్టే విరాట్ ను అధికంగా మిస్ అవుతోందని పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అయింది.

ఇక, "అనుష్క: నువ్వు లేకుండా నేనుండలేను... కోహ్లీ: నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను... భారత జట్టు: డిట్టో" అన్న ట్వీట్ తో పాటు కోహ్లీ పెళ్లికి వెళ్లే తొందరలో ఆటగాళ్లు త్వరగా పెవీలియన్ చేరుకున్నారులే అన్న ట్వీట్, టీమిండియా రన్ రేటు, ఎయిర్ టెల్ 4జీ స్పీడ్ రెండూ ఒకేలా ఉన్నాయని, శ్రీలంక జట్టు ఒకే ఒక్క ధోనీతో ఆడి గెలిచిందని... ఇలా నెటిజన్లు తమదైన కామెంట్లతో ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇండియా క్రికెట్ మొత్తం కోహ్లీపై ఆధారపడిందని, ఈ లెక్కన ఆయనకు 10 మంది పిల్లలు ఉన్నట్టని, కేంద్రానికి చెప్పి పన్ను రాయితీలను పొందవచ్చని ఓ అభిమాని పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

More Telugu News