Lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సైకియాట్రిస్ట్ పాత్రలో లావణ్య త్రిపాఠీ 
  • యూఏఈలో 'సాహో' యాక్షన్ పార్ట్   
  • సెన్సార్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'జైసింహా'
  • దుబాయ్ లో 'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ

*  యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించనుంది. సందీప్ కిషన్ హీరోగా తమిళంలో రూపొందుతున్న 'మాయావన్' చిత్రాన్ని తెలుగులోకి 'ప్రాజక్ట్ జెడ్' పేరిట అనువదిస్తున్నారు. ఇందులో ఆమె సైకియాట్రిస్ట్ పాత్రను పోషిస్తోంది.
*  'బాహుబలి' చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ ఎపిసోడ్ ను యూఏఈలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ఎడారుల్లో భారీ ఎత్తున ఈ యాక్షన్ దృశ్యాలను జనవరి మొదటి వారం నుంచి చిత్రీకరిస్తారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జైసింహా' ఆడియో వేడుకను ఈ నెల 24న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగుకు సంబంధించి మిగిలి వున్న రెండు పాటలను త్వరలో దుబాయ్ లో చిత్రీకరిస్తారు. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 28న సెన్సార్ కి పంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
*  రవితేజ హీరోగా విక్రం సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న 'టచ్ చేసి చూడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయిక  రాశిఖన్నా వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ పాత్రను పోషిస్తోంది.  

More Telugu News