India: టాస్ గెలిచిన శ్రీలంక, భారత్ బ్యాటింగ్

  • ఇండియాకు బ్యాటింగ్ అప్పగించిన లంక
  • దలైలామాను కలిసిన లంక క్రికెటర్లు
  • కోహ్లీ గైర్హాజరుతో రోహిత్ కెప్టెన్సీ

ధర్మశాలలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన లంక, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పరుగులకు స్వర్గధామంగా నిలిచే పిచ్, మధ్యాహ్నం తరువాత బ్యాటింగ్ కు మరింతగా అనుకూలిస్తుందన్న ఉద్దేశంలో ఉన్న లంక, చేజింగ్ చేసేందుకే మొగ్గు చూపింది. ఉపుల్ తరంగ, గుణతిలక, తిరిమన్నే, మ్యాథ్యూస్, గుణరత్నే, డిక్ వెల్లా, తిసార, పతిరనా, లక్మల్, అకిల, ప్రదీప్ లను లంక తుది 11 మందిగా ప్రకటించింది.

విరాట్ కోహ్లీ సెలవు తీసుకోవడంతో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. వరుసగా ఏడు సిరీస్ లను గెలిచిన భారత టీమ్, ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే, వరల్డ్ నంబర్ వన్ గా నిలుస్తుంది. మరికాసేపట్లో భారత బ్యాటింగ్ ప్రారంభమవుతుంది. కాగా, అంతకుముందు మ్యాచ్ లో తమకు విజయం దక్కాలని కోరుతూ లంక ఆటగాళ్లు దలైలామాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

More Telugu News