jawans: ఆగ్ర‌హంతో ఊగిపోతూ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ జ‌వాను.. ప్రాణాలు కోల్పోయిన న‌లుగురు జ‌వాన్లు!

  • ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో జ‌వాను
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘ‌ట‌న‌
  • కార‌ణాల‌పై అధికారుల దర్యాప్తు 

ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఓ జ‌వాను తోటి జ‌వాన్ల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో జ‌వాను గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన సంబంధిత అధికారులు మాట్లాడుతూ... బాసుగూడలోని సీఆర్పీఎఫ్‌ సీక్యాంపు 168 బెటాలియన్‌కు చెందిన శాంత్‌ కుమార్‌ అనే జవాను ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు. అత‌డు ఇన్సాస్‌ రైఫిల్‌తో కాల్పులు జ‌రిపాడ‌ని చెప్పారు. అత‌డు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన కార‌ణాల‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.    

More Telugu News