Cricket: రేపటి నుంచి వ‌న్డే సిరీస్‌ ప్రారంభం.. గెలిస్తే నంబ‌ర్ 1గా భారత్‌!

  • శ్రీలంక‌తో మూడు వ‌న్డేల‌ సిరీస్
  • వ‌న్డే ర్యాంకుల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ద‌క్షిణాఫ్రికా (120)
  • రెండో స్థానంలో వున్న భార‌త్
  • సిరీస్ గెలిస్తే అగ్ర‌స్థానంలోకి టీమిండియా

వ‌రుస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా రేప‌టి నుంచి శ్రీలంక‌తో మూడు వ‌న్డేల‌ సిరీస్ ఆడ‌నుంది. ధర్మశాలలో రేపు ఉదయం 11.30 గంటలకు మొద‌టి వ‌న్డే ప్రారంభం అవుతోంది. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో మ‌రిన్ని పాయింట్ల‌ను చేజిక్కించుకుని అగ్ర‌స్థానంలో నిల‌బ‌డుతుంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ద‌క్షిణాఫ్రికా (120), భార‌త్ (120), ఆస్ట్రేలియా (114), ఇంగ్లండ్ (114), న్యూజిలాండ్ (111) మొద‌టి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రేప‌టి వన్డేలో భారత్‌ విజయం సాధిస్తే 121 పాయింట్లతో మొద‌టి స్థానంలోకి ఎగ‌బాకుతుంది. ఈ అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకోవాలంటే భారత్‌ 3-0తో సిరీస్‌ గెలవాల్సి ఉంటుంది.

More Telugu News