nagar kurnool: స్వ‌యంగా బ‌స్సు న‌డిపిన మంత్రి జూప‌ల్లి!

  • నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ బ‌స్ డిపోలో కొత్త బ‌స్సుల ప్రారంభం
  • డిపో నుంచి ఆంజ‌నేయ గుడి వ‌ర‌కు బ‌స్సు న‌డిపిన మంత్రి
  • త‌మ‌ ప్ర‌భుత్వం ఆర్టీసీ బ‌లోపేతానికి కృషి చేస్తోంద‌ని వ్యాఖ్య

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ బ‌స్ డిపోలో పంచాయ‌తి రాజ్ శాఖ మంత్రి ఈ రోజు కొన్ని కొత్త బ‌స్సుల‌ను ప్రారంభించారు. అనంత‌రం బ‌స్ డిపో నుంచి స్థానిక ఆంజనేయ స్వామి ఆల‌యం వ‌ర‌కు స్వ‌యంగా బ‌స్సును న‌డిపి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా జూప‌ల్లి మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వాలు ఆర్టీసీని ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేశాయ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయించి ఆర్టీసీని బ‌లోపేతం చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. 

More Telugu News