allu sirish: 'ఒక్క క్షణం' రిలీజ్ డేట్ ను ఖరారు చేసేశారు!

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన వి.ఐ.ఆనంద్
  • ప్రధాన కథానాయికగా సురభి 
  • ఈ నెల 28వ తేదీన విడుదల  

కొత్త కథకోసం .. వైవిధ్యభరితమైన పాత్ర కోసం కొంతకాలం వెయిట్ చేస్తూ వచ్చిన అల్లు శిరీష్, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన వి.ఐ. ఆనంద్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'ఒక్క క్షణం' సినిమా, ఫస్టులుక్ తోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత వచ్చిన టీజర్ మరింతగా ఆసక్తిని రేకెత్తించింది.

 అలాంటి ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వలన, ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ తేదీని ఖరారు చేసేశారు. సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా, అల్లు శిరీష్ ఖాతాలో మరో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.       

More Telugu News