Gujarath: గుజ‌రాత్‌లో ముగిసిన తొలి విడ‌త పోలింగ్‌

  • 89 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన పోలింగ్‌
  • సాయంత్రం 4 గం.ల వ‌ర‌కు 47.28 శాతం న‌మోదు
  • 14న రెండో విడ‌త పోలింగ్‌

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్త‌యింది. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 47.28 శాతం పోలింగ్ నమోదయినట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. అయితే.. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం క‌ల్పించ‌నున్నారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ నెల 14న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

More Telugu News