school students: విశాఖలో 3 స్కూలు బ‌స్సులు ఢీ.. 80 మంది విద్యార్థుల‌కు గాయాలు!

  • విశాఖ‌ప‌ట్నంలోని యారాడ కొండ‌పై ప్ర‌మాదం
  • కొండ దిగుతుండ‌గా ప‌ర‌స్ప‌రం ఢీకొన్న బ‌స్సులు
  • విద్యార్థులకు ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల్లో చికిత్స‌

విశాఖ‌ప‌ట్నంలోని యారాడ కొండ‌పై ప్ర‌మాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్లి వ‌స్తోన్న 3 స్కూలు బ‌స్సులు ఒకదాన్ని ఒక‌టి ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 80 మంది విద్యార్థుల‌కు గాయాలు కాగా, వారిని వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘట‌నాస్థ‌లికి చేరుకుని ఆరా తీస్తున్నారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. ఆందోళ‌న‌కు గురైన విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రుల వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News