nithin: భారీ మల్టీస్టారర్ తో ప్రవీణ్ సత్తారు .. హీరోలుగా నితిన్ .. రానా .. నారా రోహిత్?

  • మల్టీ స్టారర్ మూవీతో ప్రవీణ్ సత్తారు
  • ముగ్గురు హీరోల చుట్టూ తిరిగే కథ
  • రానా నుంచి గ్రీన్ సిగ్నల్ 
  • నారా రోహిత్ తో సంప్రదింపులు  

'గరుడవేగ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. 'చందమామ కథలు' .. 'గుంటూరు టాకీస్' సినిమాల మాదిరిగానే ఇది మల్టీ స్టారర్. అయితే ఈసారి ఈ మల్టీ స్టారర్ .. తారాగణం పరంగా మరింత భారీతనాన్ని సంతరించుకోనుంది.

ఒక కథానాయకుడిగా నితిన్ ఖరారైనట్టు ప్రవీణ్ సత్తారు చెప్పడం .. ఆ విషయాన్ని నితిన్ కూడా స్పష్టం చేయడం జరిగిపోయింది. ఇక మరో కథానాయకుడిగా రానా పేరు వినిపిస్తోంది. కథ వినగానే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇక మూడవ కథానాయకుడిగా నారా రోహిత్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. మల్టీ స్టారర్ సినిమాలు చేయడం నారా రోహిత్ కి అలవాటే. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ఓకే చేసే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.        

More Telugu News