Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నేచురల్ థెరపీ తీసుకుంటున్న అనుష్క!
  • అప్పుడే 'అజ్ఞాతవాసి' కొత్త రికార్డు 
  • '2 కంట్రీస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి 
  • 'తెలుగు మహా సభల'కు హరీష్ శంకర్ ప్రచార గీతం 

*  అందాలతార అనుష్క శెట్టి తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ప్రస్తుతం నేచురల్ థెరపీ తీసుకుంటోందట. ఈ కారణంగానే అమ్మడు ఇంతవరకు కొత్త సినిమాలు అంగీకరించలేదని తెలుస్తోంది.        
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 'అజ్ఞాతవాసి' చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో ఏకంగా 131 లొకేషన్లలో ఈ చిత్రం రిలీజవుతూ రికార్డు కొడుతోంది. ఒక భారతీయ సినిమా ఇలా యూఎస్ లో ఇన్ని చోట్ల రిలీజ్ కావడం పెద్ద రికార్డుగా చెబుతున్నారు. గతంలో 'దంగల్', 'ట్యూబ్ లైట్' హిందీ చిత్రాలు 111 లొకేషన్లలో రిలీజయ్యాయి.
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '2 కంట్రీస్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఈ నెల 29న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు శంకర్ తెలిపారు. మలయాళంలో వచ్చిన '2 కంట్రీస్' చిత్రానికి రీమేక్ గా అదే పేరుతో ఇది రూపొందింది.
*  ఈ నెల 15 నుంచి హైదరాబాదు వేదికగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఓ ప్రచార గీతాన్ని రూపొందించాడు. తెలుగు వైభవాన్ని తెలియజెప్పే విధంగా రూపొందిన ఈ పాటను మహా సభలకు ప్రచార గీతంగా వాడతారు.  

More Telugu News