mahesh kathi: నా మానాన నేను బ‌తుకుతోంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఇన్ని ర‌కాలుగా వేధిస్తున్నారు: మ‌హేశ్ క‌త్తి

  • నా ఫోన్ నెంబ‌రుని ప‌బ్లిక్‌లో పెట్టి, హింసించారు
  • నేను ఏ సినిమాకి రివ్యూలు రాసినా వాటి కింద న‌న్ను కించ‌ప‌రుస్తూ పోస్టులు పెడుతున్నారు
  • ప్ర‌త్యేక హోదా కోసం అంద‌రూ విశాఖ వెళ్తే ప‌వ‌న్ రాలేదు
  • ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ ఇప్పటివ‌ర‌కు ఏం చేశారు

'నా జీవితంలోకి వ‌చ్చి, నా ఫోన్ నెంబ‌రుని ప‌బ్లిక్‌లో పెట్టి, ఎంత‌గానో హింసించి నా జీవితంలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంశాన్ని తీసుకొచ్చారు ఆయ‌న అభిమానులు' అని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి అన్నారు. ప‌దే ప‌దే ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేస్తోన్న మ‌హేశ్ క‌త్తి ఈ రోజు టీవీ ఛానెల్ లో చ‌ర్చ‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఏ సినిమాకి రివ్యూలు రాసినా వాటి కింద త‌న‌ను కించ‌ప‌రుస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికీ త‌న‌ను సోష‌ల్ మీడియాలో వేధిస్తున్నార‌ని తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తాను ఎటువంటి వ్యాఖ్య‌లూ చేయ‌డం లేద‌ని, ప‌వ‌న్ చెప్పుకుంటోన్న గొప్ప‌ల‌పైనే నిజాలు చెబుతున్నాన‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి లాభం చేకూర్చేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌దామ‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆనాడు విశాఖప‌ట్నానికి కూడా రాలేద‌ని, తాను మాత్రం వెళ్లాన‌ని తెలిపారు. ఆయ‌న వ‌స్తే లా అండ్ ఆర్డ‌ర్ పాడ‌వుతుంద‌ని చెప్పుకున్నార‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.           

More Telugu News