ravanasura: ప‌దిత‌ల‌ల రావ‌ణాసురుడిలా మంచు విష్ణు ఫొటో.. ప‌క్క‌నే శ్రియ!

  • ‘గాయత్రి’ సినిమా సెట్‌లో సంద‌డి
  • మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’
  • ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో శ్రియ‌

'ప‌దిత‌ల‌ల రావ‌ణాసురుడిలా వున్న సినీన‌టుడు మంచు విష్ణు' ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా సెట్‌లో శ్రియ‌తో కలిసి మంచు విష్ణు ఇలా ఫొటో దిగాడు. ఈ సినిమాలో శ్రియ, హాట్ యాంక‌ర్ అనసూయ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్‌.మదన్ దర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మరోపక్క కొన‌సాగుతున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న గాయ‌త్రి సినిమా విడుద‌ల కానుంది.   

More Telugu News