polavaram: పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నుల పురోగ‌తిని వైసీపీ నేత‌లు చూడ‌లేక‌పోతున్నారు: మ‌ంత్రి దేవినేని

  • పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించిన దేవినేని
  • పోల‌వ‌రం ప్రాజెక్టు ఆధునిక దేవాల‌యం వంటిది
  • వైసీపీ నేత‌ల‌కు మాత్రం ఈ ప్రాజెక్టు ఓ మ‌ట్టిగుట్ట‌గా క‌న‌ప‌డుతోంది

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నుల పురోగ‌తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చూడ‌లేక‌పోతున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావు అన్నారు. ఈ రోజు ప‌శ్చిమ గోదావ‌రిలో ప‌ర్య‌టిస్తోన్న దేవినేని.. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పోల‌వ‌రం ప్రాజెక్టు ఆధునిక దేవాల‌యం వంటిద‌ని అభివ‌ర్ణించారు. వైసీపీ నేత‌ల‌కు మాత్రం ఈ ప్రాజెక్టు ఓ మ‌ట్టిగుట్ట‌గా క‌న‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు.

ప‌నులు జ‌రుగుతోంటే వైసీపీ ఓర్వ‌లేక‌పోతోంద‌ని మ‌ంత్రి దేవినేని అన్నారు. డ‌యాఫ్రం వాల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి గోడ ఎక్క‌డ ఉంద‌ని వైసీపీ నేత‌లు అన్నార‌ని చుర‌క‌లంటించారు. గ‌తంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ మంత్రిగా ఉండి కూడా తోట‌ప‌ల్లి ప్రాజెక్టును పూర్తి చేయ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని, ఆ ప్రాజెక్టును తాము పూర్తి చేశామ‌ని చెప్పారు.   

More Telugu News