Chandrababu: పొత్తుల‌పై తొంద‌ర వ‌ద్దు.. వ‌చ్చే ఏడాదే ఎన్నిక‌ల ఏడాది!: చ‌ంద్ర‌బాబు

  • టీడీపీ నేత‌ల‌కు సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు
  • అప్ప‌టి సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం
  • ప్రజలకు చేరువయ్యేలా పనులు చేయాలి
  • నెలకోసారి టీడీపీ నేతలను కలుస్తా

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు కూడా తీసుకుంది. కాగా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనే విష‌యంపై తాము ఇప్పుడే ఆలోచించ‌డం లేద‌ని ఆ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

ఈ రోజు అమరావతిలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెట్టుకోవాల్సిన‌ పొత్తులపై అప్పుడే తొందర వద్దని త‌మ పార్టీ నేత‌ల‌కు చెప్పిన‌ట్లు తెలిపారు. అప్ప‌టి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని అన్న‌ట్లు చ‌ంద్ర‌బాబు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అధికారంలో వున్నాం కాబట్టి, ప్రజలకు చేరువయ్యేలా పనులు చేయాలని తాను పార్టీ నేత‌లకు చెప్పిన‌ట్లు వివ‌రించారు. వచ్చే ఏడాదే ఎన్నికల ఏడాదని ఆయన తేల్చి చెప్పారు. తాను నెలకోసారి టీడీపీ నేతలను కలుస్తానని తెలిపారు.         

More Telugu News