xiaomi: డిసెంబ‌ర్ 14న‌ షియోమి రెడ్‌మీ 5ఎ రెండో సేల్

  • ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ల‌లో అమ్మ‌కాలు
  • మొద‌టి సేల్‌కి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ‌
  • రూ. 4,999కే దేశ్ కా స్మార్ట్‌ఫోన్‌

షియోమి వారి రెడ్‌మీ 5ఎ రెండో సేల్ డిసెంబ‌ర్ 14, మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు ప్రారంభంకానుంది. ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌, షియోమి అధికారిక వెబ్‌సైట్ ఎంఐ.కామ్‌ల‌లో ఈ ఫోన్ అమ్మ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, నిన్న జ‌రిగిన మొద‌టి సేల్‌లో రెడ్‌మీ 5ఎ ఫోన్లకు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింద‌ని షియోమి ఇండియా ఎండీ, వైస్ ప్రెసిడెంట్ మ‌ను కుమార్ జైన్ తెలిపారు.

ఈ మోడ‌ల్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 2జీబీ ర్యామ్‌, 16 జీబీ మెమొరీ ఉన్నది ఒక‌టిగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీతో మ‌రోటి. వీటి బేస్ మోడ‌ల్ ధ‌ర రూ. 5,999 అయిన‌ప్ప‌టికీ మొద‌టి 5 మిలియ‌న్ల ఫోన్ల‌ను రూ. 4,999కే కంపెనీ అంద‌జేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన రివ్యూల ప్ర‌కారం ఇది నిజంగా `దేశ్ కా స్మార్ట్‌ఫోన్` అంటూ నెటిజ‌న్లు కితాబు ఇస్తున్నారు.

More Telugu News