manasuku nachindi: ఆక‌ట్టుకుంటున్న సందీప్ కిష‌న్ 'మ‌న‌సుకు న‌చ్చింది' ప్రీ లుక్‌

  • విడుద‌ల చేసిన ఆనందీ ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్‌
  • ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న మ‌హేశ్‌బాబు మేన‌కోడ‌లు జాన్వి
  • రేపు ప్రీ లుక్ టీజ‌ర్ కూడా

ఇటీవ‌ల 'కేరాఫ్ సూర్య‌' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సందీప్ కిష‌న్ త‌ర్వాతి చిత్రం 'మ‌న‌సుకు న‌చ్చింది' ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. చేతిలో కెమెరా ప‌ట్టుకుని ఆకాశాన్ని చూస్తున్న‌ సందీప్, ప‌క్క‌నే కూర్చుని సందీప్‌ను చూస్తున్న హీరోయిన్‌‌ను ఈ ప్రీలుక్‌లో చూడొచ్చు. ప్రీ లుక్‌తోనే ఇది మంచి ఫీల్ గుడ్ ల‌వ్ సినిమా అనే అభిప్రాయం క‌లిగేలా చేశారు.

ఈ చిత్రాన్ని ఆనందీ ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తుండగా, మ‌హేశ్ బాబు సోద‌రి మంజుల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమైరా ద‌స్తూర్‌, త్రిదా చౌద‌రి హీరోయిన్లుగా నటిస్తుండగా, మంజుల కూతురు జాన్వి న‌టిగా తెరంగేట్రం చేస్తోంది. ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్ త‌ర్వాత రేపు ప్రీలుక్ టీజ‌ర్‌ని కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

More Telugu News