metro rail: మెట్రోరైలులో అమ్మాయిల ఫొటోలు తీస్తూ ప‌ట్టుబ‌డిన వృద్ధుడు

  • ఉప్ప‌ల్‌-నాగోలు మ‌ధ్య ప‌ట్టుకున్న షీ టీమ్‌
  • అబ్దుల్లాపూర్‌మెట్ వాసిగా గుర్తింపు
  • సెక్ష‌న్ 354 కింద అరెస్టు

హైద్రాబాద్ మెట్రో రైలులో అమ్మాయిల ఫొటోలు తీస్తున్న 65 ఏళ్ల వృద్ధుడిని షీ టీమ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉప్ప‌ల్-నాగోలు మ‌ధ్య‌లో షీ టీమ్ నిర్వ‌హించిన డీకాయ్ ఆప‌రేష‌న్‌లో పెద్ద అంబ‌ర్‌పేట్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన ఎన్‌. న‌ర‌సింహ దొరికాడు. విద్యాశాఖలో పనిచేసి ప‌దవీ విర‌మ‌ణ చేసిన న‌ర‌సింహ‌ను రాచ‌కొండ పోలీసులు అరెస్టు చేశారు.

త‌న సీటులో కూర్చుని ఎదురుగా కూర్చున్న అమ్మాయిల ఫొటోలు తీస్తున్న న‌ర‌సింహ‌ను షీ టీమ్ ప్ర‌శ్నించగా తాను మెట్రో రైలు ప్ర‌యాణాన్ని తీస్తున్న‌ట్లు బుకాయించాడు. కానీ త‌ర్వాత అత‌ని ఫోన్లో చూస్తే అన్నీ అమ్మాయిల ఫొటోలే ఉండ‌టంతో సెక్ష‌న్ 354 కింద అరెస్టు చేసి, రిమాండ్‌కి త‌ర‌లించారు.

More Telugu News