balakrishna: అంతరిక్ష యాత్రికుడిగా కనిపించనున్న బాలకృష్ణ?

  • ఎస్వీ కృష్ణారెడ్డితో బాలకృష్ణ 
  • ఫాంటసీ నేపథ్యంతో కథాంశం 
  • బాలకృష్ణ ఓకే అన్నారంటూ టాక్ 

'జై సింహా' సినిమాను పూర్తిచేసిన బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ ను మొదలుపెట్టవలసి వుంది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం ఉండటంతో, ఎస్వీ కృష్ణారెడ్డితో ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కథను ఎస్వీ కృష్ణారెడ్డి వినిపించడంతో, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ అంతరిక్ష యాత్రికుడిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

 గతంలో 'యమలీల' వంటి ఫాంటసీతో కృష్ణారెడ్డి .. 'ఆదిత్య 369'తో బాలకృష్ణ విజయాలను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వాళ్ల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఫాంటసీ మూవీ తెరకెక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెప్పుకుంటున్నారు.      

More Telugu News