Narendra Modi: కేంద్ర మాజీ మంత్రి త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన ప్ర‌ధాని మోదీ!

  • ప్ర‌ధాని మోదీపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌
  • ఆయ‌న అన్న మాట‌లు అవమానించడం మాత్రమే కాదు
  • ఇది ఆయన మొగలాయి మైండ్‌సెట్ ను తెలియ‌జేస్తోంది
  • బ్యాలెట్‌ బాక్స్‌లలో ప్రజలు వారికి త‌గిన‌ సమాధానం చెబుతారు-మోదీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నీచుడు, సభ్యత లేనివాడు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఈ విష‌యంపై మోదీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గొప్ప విద్యా సంస్థల్లో చదివి, దౌత్యవేత్తగా, కేంద్ర‌ మంత్రిగా ప‌నిచేసిన మ‌ణి శంక‌ర్ అయ్యర్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు.

త‌న‌ను కిందిస్థాయి వ్య‌క్తి అని, సంస్కారం లేని వాణ్ణని అన్నారని ప్ర‌ధాని మోదీ గుర్తు చేశారు. ఆయ‌న అన్న మాట‌లు అవమానించడం మాత్రమే కాదని, ఇది ఆయన మొగలాయి మైండ్‌సెట్ ను తెలియ‌జేస్తోంద‌ని అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తాను ఇంతకంటే ఏమీ చెప్పలేన‌ని అన్నారు. అది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన విధానమ‌ని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లలో ప్రజలు వారికి త‌గిన‌ సమాధానం చెబుతారని, ఇటువంటి వారు మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.

More Telugu News