rangasthalam 1985: రేపు సాయంత్రం 5:30కి 'రంగ‌స్థ‌లం 1985' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

  • ప్ర‌క‌టించిన మైత్రి మూవీ మేక‌ర్స్
  • ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
  • చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సుకుమార్‌

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రంగ‌స్థలం 1985' చిత్రం ఫ‌స్ట్‌లుక్ రేపు సాయంత్రం 5:30కి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. దాదాపు రూ. 45 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

1985 కాలం నాటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం కోసం ప్ర‌త్యేకంగా సెట్ వేసిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, యాంక‌ర్ అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలందిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, గౌతమిల‌తో పాటు పూజ హెగ్డే ఓ ప్ర‌త్యేక పాట‌లో క‌నిపించ‌నుంది.

More Telugu News