allu shirish: రేపు 'ఒక్క క్షణం' మూవీ నుంచి మొదటి పాట రిలీజ్!

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం' 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • ఈ నెల చివరిలో సినిమా రిలీజ్  

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'ఒక్క క్షణం' సినిమా రూపొందింది. ఈ నెల చివరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ ను రాబడుతూ .. సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక మరింత ఆత్రుతను పెంచేందుకుగాను, ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన పాటల్లో నుంచి మొదటి పాటగా 'సో మెనీ .. సో మెనీ' అంటూ సాగే పాటను రేపు మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేయనున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ పాటతోనే వాళ్లని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నంలో వున్నారు. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' తరువాత వి.ఐ. ఆనంద్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. అల్లు శిరీష్ జోడీగా సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.     

More Telugu News