Pawan Kalyan: అలా జ‌రిగి ఉంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేది: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే బాగుండేది
  • ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న చిరంజీవికి ఉండేది
  • ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేకహోదాపై ఎందుకు మాట్లాడ‌రు?
  • ప్ర‌జారాజ్యంలో గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై వారు క‌స్సున లేచారు

తాను స్ప‌ష్ట‌మైన‌ విధి విధానాలతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. రాజ‌మ‌హేంద్ర వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేదని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న చిరంజీవికి ఉండేదని చెప్పుకొచ్చారు.

కాగా, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేకహోదాపై ఎందుకు మాట్లాడ‌రు? అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. హోదాపై తానొక్క‌డినే మాట్లాడాలా? అని నిల‌దీశారు. గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై వారు క‌స్సున లేచార‌ని, మ‌రి వారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని అడిగారు.

More Telugu News