India: చైనాలోకి వెళ్లి కూలిపోయిన భారత డ్రోన్... కూల్చేశారని అనుమానం!

  • ఓ డ్రోన్ మా గగనతలంలో కుప్పకూలింది
  • చైనా మీడియాకు తెలిపిన సైన్యాధికారి 
  • సమాచారం సేకరిస్తున్నామని వెల్లడి
  • ఏ వివరణా ఇవ్వని భారత్

తమ గగనతలంలోకి వచ్చిన భారత మానవ రహిత విమానం కుప్పకూలిపోయిందని చైనా ఆరోపించింది. తమపై నిఘా కోసం భారత్ ఓ డ్రోన్ ను ప్రయోగించిందని, అది తమ ఎయిర్ స్పేస్ లోకి వచ్చి కూలిందని చైనా మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇవ్వకపోయినా, ఈ డ్రోన్ గురించిన పూర్తి వివరాలను, అందులోని సమాచారాన్ని క్రోడీకరిస్తున్నామని రక్షణ శాఖ అధికారులు వెల్లడించినట్టు చైనా అధికార వార్తా సంస్థ 'క్సిన్హువా' పేర్కొంది. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ భారత్ ఈ డ్రోన్ ను పంపిందని ఆయన ఆరోపించినట్టు తెలిపింది. కాగా, ఈ డ్రోన్ ను చైనా దళాలే కూల్చేసి ఉండవచ్చని కూడా అనుమానాలు ఉన్నాయి. భారత్ నుంచి మాత్రం డ్రోన్ విషయమై ఎటువంటి స్పందనా ఇంకా రాలేదు.

More Telugu News