airtel: రెండు ప్లాన్లను సవరించిన ఎయిర్‌టెల్‌.. ఇక‌పై అద‌నంగా డేటా!

  • జియోకి దీటుగా ఎయిర్‌టెల్ ఆఫ‌ర్లు
  • రూ.349 ప్లాన్‌తో ఇక‌పై ప్ర‌తిరోజు 2జీబీ డేటా
  • రూ.549 ప్యాక్ తో 3 జీబీ డేటా

టెలికాం మార్కెట్లో రిల‌య‌న్స్ జియో ఇస్తోన్న పోటీతో అందుకు దీటుగా ఆఫ‌ర్లు ఇస్తోన్న ఎయిర్‌టెల్ త‌మ‌ రూ.349, రూ.549 ప్యాక్స్‌ల‌ను స‌వ‌రించింది. రూ.349 తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల కాల ప‌రిమితితో ఇప్ప‌టివ‌ర‌కు 1.5 జీబీ, అపరిమిత కాల్స్ ను వినియోగ‌దారులు అందుకునేవారు. ఇక‌పై ఈ ప్లాన్‌తో రోజుకి 2జీబీ డేటా అందుకోవ‌చ్చు. అంటే వినియోగ‌దారులు ఈ ప్లాన్‌పై అదనంగా 500 ఎంబీ డేటా అందుకోవ‌చ్చు.

అలాగే రూ.549 తో రీఛార్జి చేసుకుంటే కూడా 500 ఎంబీ డేటాను ఎయిర్‌టెల్ అద‌నంగా అందిస్తోంది. ఇప్పటి వరకు వినియోగ‌దారులు ఈ ప్లాన్‌తో 2.5 జీబీ డేటాను అందుకుంటుండ‌గా, ఇక‌పై 3 జీబీ అందుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా అందుకోవ‌చ్చు.  

More Telugu News