ntr: ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ల చిత్రం గురించి మ‌రో అప్‌డేట్‌... స్పోర్ట్స్ డ్రామా?

  • క‌థ‌ను అందించ‌నున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, గుణ్ణం గంగరాజు
  • హీరోలిద్ద‌రి ఇమేజ్‌కి స‌రిపోయేలా క‌థ‌
  • ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ల‌తో రాజమౌళి చేయనున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రంలో ఎలాంటి గ్రాఫిక్స్ వాడ‌బోర‌న్న అప్‌డేట్‌తో పాటు మ‌రో కొత్త విష‌యం కూడా తెలిసింది.

ఇద్ద‌రు పెద్ద హీరోల‌కు స‌రిపోయేలా ఒక స్పోర్ట్స్ డ్రామాను రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు క‌థ‌ను గుణ్ణం గంగరాజు అంద‌జేస్తుండ‌గా దాన్ని అభివృద్ధి చేయ‌డానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌హాయం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం వారిద్దరూ కలసి కథకు సంబంధించిన పనులలో బిజీగా వున్నట్టు తెలుస్తోంది.    

More Telugu News